Wayanad: తుడిచిపెట్టుకుపోయిన 4 గ్రామాలు.. వయనాడ్ కొండ చరియల విధ్వంసం.. ఆ 250 మంది సంగతేంటో?
Wayanad: కేరళలో సంభవించిన ప్రకృతి విలయం.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందల మంది శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి కురిసిన భీకర వర్షాలకు కొండ ప్రాంతాల్లోని నీళ్లు, బురద, రాళ్లు.. ఒక్కసారిగా సమీప గ్రామాలపై విరుచుకుపడ్డాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. మరోవైపు.. మరికొందరి ఆచూకీ గల్లంతు కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.